పనాజీ: కరోనా పంజా విసరడంతో దేశంలోని చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ బాటపట్టాయి. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ అమలుచేస్తున్నాయి. నిన్న కేరళలో పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రారంభమయ్యింది. తాజాగా మరో దక్షిణాది రాష్ట్రంలోనూ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో నేటి నుంచి 15 రోజుల పాటు పూర్తి కర్ఫ్యూను విధిస్తూ సీఎం ప్రమోద్ సావంత్ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజధానితోపాటు అన్ని ప్రాంతాల్లో రహదారులు నిర్మాణుష్యంగా మారాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అత్యవసర సేవలతో సంబంధం ఉన్న దుకాణాలను తెరిచే అవకాశం కల్పించారు. అదేవిధంగా రెస్టారెంట్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ‘ఫుడ్ హోం డెలివరీ’ చేయనున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 24 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
గోవాలో గత 24 గంటల్లో కొత్తగా 3751 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,213కు చేరింది. ఇందులో 32,387 కేసులు యాక్టివ్గా ఉండగా, 82,214 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1612 మంది మృతిచెందారు. కాగా, దేశంలో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 4,092 మంది వైరస్ వల్ల కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,22,96,414కు చేరగా, మృతులు 2,42,362కు పెరిగారు. మరో 1,83,17,404 బాధితులు కరోనానుంచి కోలుకోగా, 37,36,648 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్తగా 3,86,444 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి