న్యూఢిల్లీ: యయోగా గురు రాందేవ్ బాబా తాజాగా వైద్యులను ఉద్దేశించి మరో వాదన లేవదీశారు. కొన్ని రోగాలకు అల్లోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స లేదంటూ నిలదీశారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను ట్విట్టర్లో అప్లోడ్ చేశారు.
ఇంతకుముందు ఇంగ్లీష్ (అలోపతి) వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో వాటిని రాం దేవ్ బాబా ఉపసంహరించుకున్నారు. తాజాగా కొన్ని రోగాలకు శాశ్వత చికిత్స లేకపోవడాన్ని ప్రశ్నించారు.
ఎందుకు బీపీ, మధుమేహానికి ఇంగ్లీష్ వైద్యంలో శాశ్వత చికిత్స లేదని నిలదీశారు. థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఉబ్బసంతో బాధపడుతున్న రోగుల ఉపశమనానికి ఔషధ తయారీ సంస్థల వద్ద మందులు ఉన్నాయా? అని ప్రశ్నించారు రాందేవ్.
కాలేయ వ్యాధి చికిత్సకు, గుండెలో అడ్డంకులకు, పెరిగిన కొవ్వును తగ్గించడానికి అల్లోపతిలో ఉన్న చికిత్సలేమిటని ఐఎంఏను సవాల్ చేశారు. ఇంకా పార్శపు నొప్పి, మతిమరుపు, పార్కిన్సన్ వ్యాధులను ఎలా నయం చేస్తారో చెప్పాలని కోరారు.
అన్నింటికి అలోపతి సర్వరోగ నివారణి అని భావించొద్దని వైద్యులకు హితవు చెప్పారు. దీనికి కారణం అల్లోపతి వైద్యం వయస్సు కేవలం 200 ఏండ్లేనని గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే, ఇటీవల పతంజలీ డెయిరీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ బన్సాల్ (57) కొవిడ్-19తో మరణించారు. అల్లోపతిలో బన్సాల్ చికిత్స పొందారని, అందులో తమ ప్రమేయం లేదని పతంజలి డెయిరీ వర్గాల కథనం.
కొవిడ్-19 భారిన పడ్డ సంజయ్ బన్సాల్.. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న సంజయ్ బన్సాల్ భార్య.. ఆయన చికిత్స వ్యవహరాలను పర్యవేక్షించారని సమాచారం.
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’
కరోనా నుండి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
కరోనాపై మాటల్లోనే భయం.. చేతల్లో లేదు
తృణమూల్ పద్మవ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
చోక్సీ కొత్త ఎత్తు.. అంటిగ్వా నుంచి క్యూబాకు మకాం మార్పు!
టాటా స్టీల్ మహా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్రశంసల జల్లు
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’