సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్
సిద్దిపేట టౌన్, జూన్ 1 : అనవసరంగా ఎవరూ రోడ్లపై వచ్చి కరోనా బారిన పడొద్దని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ సూచించారు. లాక్డౌన్లో భాగంగా మంగళవారం క్షేత్రస్థాయిలో బందోబస్తును పర్యవేక్షించారు. పట్టణంలోని పలు ప్రధాన చౌరస్తాల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చే వారు విధిగా మాస్క్ ధరించాలన్నారు. లాక్డౌన్, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 3767 మందిపై కేసులు నమోదు చేసి 674 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో బయటకు వెళ్లే వారికి ఆన్లైన్ ద్వారా 5603 పాసులు అందించామన్నారు. నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 5145 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. కూరగాయల మార్కెట్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్లో ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.