హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సమాజం పక్షాన ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ పవిత్రమైన తెలంగాణ నేలపై విషం చిమ్మవద్దని, దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లు అడగాలని ప్రధానిని డిమాండ్ చేశారు.