Security Heightened | ఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనం (Parliament premises) భద్రతా వలయంలోకి (Security Heightened) వెళ్లిపోయింది. మొన్న జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనతో కేంద్ర బలగాలు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఢిల్లీలోని భారత పార్లమెంట్లో భారీ భద్రతాలోపం (security breach) బయటపడిన విషయం తెలిసిందే. బుధవారం శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జీరో అవర్లో ఇద్దరు ఆగంతకులు లోక్సభ (Lok Sabha)లోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. కలర్ స్మోక్ వదిలి ఎంపీలను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఇందులో భాగంగానే పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నారు. మళ్లీ ఎవరూ ఇలాంటి భద్రతా ఉల్లంఘనలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. భవనం చుట్టు భద్రతా సిబ్బంది డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. అక్కడికి వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్లమెంట్ భవనం ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసుల భద్రత విధుల్లో ఉన్న వీడియో ఏఎన్ఐ ట్విట్టర్లో పోస్టు చేసింది.
#WATCH | Delhi: Security heightened in Parliament premises following the December 13 security breach incident. pic.twitter.com/fIRGWlOvVk
— ANI (@ANI) December 15, 2023
Also Read..
Bhajan Lal Sharma | రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం
Brazilian Singer | లైవ్ ప్రదర్శన ఇస్తూ.. స్టేజ్పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ సింగర్