కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని బాలూర్ఘాట్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆమె.. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడానికి ప్రధాని నరేంద్రమోదీయే కారణమని ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ను మోదీ సృష్టించిన విపత్తుగా అభివర్ణించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉన్నది. నేను దీన్ని మోదీ సృష్టించిన విపత్తే అంటాను. ఆస్పత్రుల్లో సరిపడా ఇంజెక్షన్లు లేవు. ఆక్సిజన్కూ కొరతే ఉన్నది. దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కరోనా టీకాలను, ఔషధాలను మాత్రం విదేశాలకు తరలించారు అని మమతా బెనర్జి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మళ్లీ బెంగాల్ ఇంజిన్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని, మోదీ డబుల్ ఇంజిన్ గవర్నమెంటుకు అవకాశమే ఉండదని ఆమె పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ప్రజలకు ఫేస్ మాస్కులు పంచిపెట్టిన దేవుళ్లు..!
మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..