Elections | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఏ క్షణమైనా ఎన్నికలు (Elections ) జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు (Supreme Court)కు కేంద్ర ప్రభుత్వం (Centre) వెల్లడించింది. ఆర్టికల్ 370 (Article 370) రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. జమ్మూలో ఎన్నికల ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఒక కాలపరిమితిని పేర్కొనాల్సిందిగా మంగళవారం మొదటిసారి కేంద్రాన్ని కోరింది. దీనికి స్పందించిన కేంద్రం జమ్మూకశ్మీర్లో ఏ క్షణాన అయినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు గురువారం తెలిపింది. ఈ మేరకు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు.
జమ్మూ కశ్మీర్ కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని కేంద్రం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ కొనసాగుతోంది. 5 ఆగస్టు 2019లో కేంద్రం రద్దు చేసిన ఈ అధికరణతో జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి హోదాను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రం చెప్పింది. హోంమంత్రి అమిత్ షా కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. కానీ అలాంటి చర్యకు ఎలాంటి గడువు విధించలేదు. ఈ నేపథ్యంలో నేడు అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ‘సానుకూల’ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్య స్థాపనే కీలకం: సుప్రీంకోర్టు
కాగా, జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గత మంగళవారం సుప్రీంకోర్టు(supreme court)లో వాదనలు జరిగాయి. జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమే కీలకమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిర్దేశిత సమయంలోగా ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే వీలు ఉంటుందా, ఓ రాష్ట్రం నుంచి యూటీని రూపొందించవచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని, ప్రజాస్వామ్యం స్థాపన ఎప్పుడు జరుగుతుందని కోర్టు కేంద్రాన్ని అడిగింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఈ ప్రశ్నలు వేసింది. కేంద్ర పాలిత ప్రాంతం అనేది పర్మినెంట్ కాదు అని, కానీ లడాఖ్ మాత్రం యూటీగానే ఉంటుందని తుషార్ మెహతా తెలిపారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర పరిస్థితిపై గురువారం కేంద్రం పాజిటివ్ ప్రకటన చేయనున్నట్లు ధర్మాసనానికి తెలిపారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే.
Also Read..
Fire Accident | భారీ అగ్నిప్రమాదం.. 52 మంది సజీవదహనం
Anand Mahindra | రాఖీ వేళ.. చెల్లికి క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్ర