Ayodhya Ram Mandir | రంగుల పండుగ హోలీ (Holi)ని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు. ఇక శ్రీరామ జన్మభూమి క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో (Ayodhya Ram Mandir) హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
సోమవారం హోలీ సందర్భంగా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ‘రంగోత్సవం’ (Rangotsav) కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. హోలీ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు ఈ రంగోత్సవం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగులు పూసుకుంటూ సందడి చేశారు. భక్తిగీతాలను ఆలపిస్తూ హోలీ వేడుకల్లో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
श्री राम जन्मभूमि मंदिर में रंगोत्सव
Rangotsav at Shri Ram Janmabhoomi Mandir pic.twitter.com/nJgjb2QT7Z
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 25, 2024
Also Read..
Erode MP | ఎన్నికల్లో అవకాశం రాకపోవడంతో మనోవేదన.. పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చేరిన ఎంపీ
Himachal CM | గతం గతః.. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుపైనే మా దృష్టి: హిమాచల్ సీఎం
Harish Rao | 20 లక్షల ఎకరాల్లో పండిన పంట.. 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మహత్య : హరీశ్రావు