Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎండీఎంకే (MDMK)కు చెందిన ఈరోడ్ ఎంపీ (Erode MP) గణేశమూర్తి (Ganeshamoorthy)ఆరోగ్యం ఆదివారం ఉదయం హఠాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు అతడిని కోవైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే, గణేశమూర్తి తాను పురుగుల మందు తాగినట్లు (consuming pesticide) కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతకు లోనైనట్లు వెల్లడించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు గణేశమూర్తిని కోవైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని.. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినట్లు వివరించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెరుగైన వైద్యం కోసం కోయంబత్తూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు గణేశమూర్తిని ఎమ్డీఎమ్కే నేత దురై వైకో పరామర్శించారు.
కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం కేటాయించారు. దీంతో ఎండీఎంకే పార్టీ తరఫున గణేశమూర్తి బరిలోకి దిగి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎండీఎంకేకు తిరుచ్చి లోక్సభ స్థానం కేటాయించారు. అక్కడ దురైవైగోను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గణేశమూర్తికి అవకాశం ఇవ్వలేదు. దీంతో వారం రోజుల నుంచి తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
Also Read..
Taapsee Pannu | బాయ్ఫ్రెండ్ను రహస్యంగా పెళ్లిచేసుకున్న తాప్సీ..?
Indian student | లండన్ రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని మృతి
Family Star | విజయ్దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ హోలీ డ్యాన్స్తో ఫ్యామిలీ స్టార్ సాంగ్ లాంఛ్