Indian student | విదేశాల్లో భారత విద్యార్థుల మరణాలు కలచివేస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం ఫారన్ వెళ్లి అక్కడ జరిగిన అనుకోని ఘటనల్లో భారతీయ విద్యార్థులు (Indian student) మరణిస్తున్న వరుస ఘటనలు ఇటీవలే వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా లండన్ (London)లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నీతీ అయోగ్ (NITI Aayog) మాజీ ఉద్యోగురాలు, పీహెచ్డీ విద్యార్థి చేష్టా కొచ్చర్ (Cheistha Kochar) ప్రాణాలు కోల్పోయారు.
హర్యానా గురుగ్రామ్కు చెందిన చేష్టా (33) గత సెప్టెంబర్లో పీహెచ్డీ కోసం లండన్ వెళ్లారు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన రాత్రి 8:30 గంటల సమయంలో సెంట్రల్ లండన్లో సైకిల్పై (cycling) ప్రయాణిస్తున్న చేష్టాను ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కాగా, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ కూతురే చేష్టా కొచ్చర్. కూతురి మరణవార్త విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదం చేష్టా కుటుంబంలో విషాదం నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు.
గతంలో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో యూనివర్సిటీలో చదువుకున్నారు. 2021 నుంచి 23 మధ్యకాలం నీతీ అయోగ్లో పని చేశారు. ఈ నేపథ్యలో చేష్టా మృతిపై నీతీ అయోగ్ మాజీ సీఈఓ అమితాబ్కాంత్ స్పందించారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. చేష్టా ఎంతో ధైర్యవంతురాలని, గతంలో తనతో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ఇంత త్వరగా ఆమె ఈ లోకాన్ని వదిలివెళ్లడం బాధాకరమన్నారు.
Cheistha Kochar worked with me on the #LIFE programme in @NITIAayog She was in the #Nudge unit and had gone to do her Ph.D in behavioural science at #LSE
Passed away in a terrible traffic incident while cycling in London. She was bright, brilliant & brave and always full of… pic.twitter.com/7WyyklhsTA— Amitabh Kant (@amitabhk87) March 23, 2024
Also Read..
Mahakal Temple | ఉజ్జయినీ ఆలయంలో అగ్నిప్రమాదం.. పూజారులు సహా 13 మందికి..
Pallavi Dempo | గోవాలో తొలిసారిగా ఓ మహిళకు బీజేపీ ఎంపీ టికెట్..
BJP | టికెట్ ఇచ్చినా పోటీకి నై.. లోక్సభ బరిలో దిగేందుకు వెనుకాడుతున్న బీజేపీ అభ్యర్థులు