Rajasthan | ఏడేళ్ల బాలికను మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి కొనుగోలు చేసి ఆపై వివాహం చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ (Rajasthan) ధోల్పూర్ (Dholpur) జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని మానియా ( Mania) గ్రామానికి చెందిన 38 ఏళ్ల భూపాల్ సింగ్ (Bhupal Singh).. ఏడేళ్ల వయసు ఉన్న ఓ బాలికను ఆమె తండ్రి నుంచి రూ.4.5లక్షలకు కొనుగోలు చేశాడు. అనంతరం మే 21వ తేదీన ఆ బాలికను భూపాల్ సింగ్ వివాహం (Married) చేసుకున్నాడు. ఈ ఘటనపై తమకు మంగళవారం సమాచారం అందినట్లు ధోల్పూర్ పోలీసు సూపరింటెండెంట్ (Dholpur Superintendent of Police) మనోజ్ కుమార్ ( Manoj Kumar ) తెలిపారు. సమాచారం అందిన వెంటనే మానియా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (Mania Deputy Superintendent of Police) దీప్క్ ఖండేల్వాల్ (Deepak Khandelwal) నేతృత్వంలోని పోలీసు బృందం బాలిక ఇంటి వద్దకు చేరుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో ఎంతమంది ప్రమేయం ఉందనే దానిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read..
Road Accident | లోయలో పడిన క్రూజర్ వాహనం.. ఆరుగురు మృతి
Vaibhavi Upadhyaya: ఫేమస్ టీవీ నటి వైభవి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మృతి
PM Modi | ప్రధానిపై షో.. ఎన్డీటీవీ యాంకర్ రాజీనామా!