PM Modi | న్యూఢిల్లీ, మే 23: ఎన్డీటీవీ సీనియర్ ఎడిటర్, యాంకర్ శరబ్ జాకబ్ తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేశారు. ఆమె 20 ఏండ్లుగా ఆ చానల్లో పని చేస్తున్నారు. మహిళల పట్ల ప్రధాని మోదీ చూపించే గౌరవంపైన ఒక కార్యక్రమం చేసిన మరుసటి రోజే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
మాజీ సీఎఫ్వో కంపెనీపై ఈడీ దాడులు
ఆర్థిక మోసగాడు సంజయ్ ప్రకాశ్ సింగ్(షెర్పురియా)తో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్డీటీవీ గ్రూప్ మాజీ సీఎఫ్వో సౌరవ్ బెనర్జీ స్థాపించిన మై స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఈడీ దాడులు చేసింది. ఈ నెల ఆరంభంలోనూ ఈడీ ఈ కంపెనీల్లో సోదాలు చేసి రూ.4.6 కోట్ల నిధులను స్తంభింపచేసింది.