Rahul Gandhi | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని కేదార్నాథ్ ఆలయాన్ని (Kedarnath Temple) కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం సందర్శించారు. ప్రైవేటు హెలికాప్టర్లో కేదార్నాథ్ చేరుకున్న రాహుల్కు ఆలయ పూజారులు, కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం కేదారేశ్వరుడ్ని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ అక్కడ ‘ఛాయ్ సేవ’లో పాల్గొని భక్తులకు టీ అందించారు ( Serves Tea To Pilgrims). అనంతరం భక్తులతో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడిన విషయం తెలిసిందే. అదే పంథాను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రైతులు, ట్రక్కు డ్రైవర్లు, వ్యాపారులు, రైల్వే స్టేషనల్లో కూలీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
अपनी केदारनाथ यात्रा के दौरान श्रद्धालुओं के लिए चाय सेवा देते @RahulGandhi जी
📍 केदारनाथ मंदिर, उत्तराखंड pic.twitter.com/CSpRlIKcsb
— Congress (@INCIndia) November 5, 2023
बाबा केदारनाथ की आरती में @RahulGandhi जी शामिल हुए।
हर हर महादेव pic.twitter.com/GvjtalIsJV
— Congress (@INCIndia) November 5, 2023
Also Read..
Israel – Hamas War | గాజాను రెండుగా విభజించి భీకర దాడులు.. ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం
Virat Kohli | షారుఖ్ ఖాన్ పాటకు స్టెప్పులేసిన కోహ్లీ.. వీడియో వైరల్