Rahul Gandhi | తిరువనంతపురం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ అభ్యర్థిని మార్చుతూ వచ్చిన సీపీఐ ఈసారి ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి ‘అన్నీరాజా’ను బరిలోకి దించింది. బీజేపీ తరపున ఆ పార్టీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈ నియోజకవర్గం నుంచే ఈసారి మళ్లీ పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. వయనాడ్ ఎంపీ నియోజకవర్గానికి రెండవ విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. దశాబ్దాలుగా పార్టీకి కంచుకోటగా నిలిచిన అమేథీని వదులుకుని మరీ ఈ ఒక్క చోట నుంచే పోటీ చేస్తుండడంతో రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
#WATCH | Lok Sabha elections 2024 | Kerala: Congress party’s sitting MP and candidate Rahul Gandhi files his nomination from Wayanad
His sister and party’s general secretary Priyanka Gandhi Vadra is also present with him.
CPI has fielded Annie Raja from this seat and BJP has… pic.twitter.com/NoFpSbcLto
— ANI (@ANI) April 3, 2024