తిరుచరాపల్లి: తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో సుమారు 70 లక్షల ఖరీదైన బంగారాన్ని పట్టుకున్నారు(Gold Seized). దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 977 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని సీజ్ చేశారు. అయితే ఆ బంగారాన్ని మూడు ప్యాకెట్లలో పురీషనాళంలో అతను దాచిపెట్టాడు. పేస్ట్ తరహాలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో దుబాయ్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి అతను ప్రయాణించాడు. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి తదుపరి విచారణ చేపడుతున్నారు. మార్చి నెలలో కూడా తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 410 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. సింగపూర్ నుంచి అతను వచ్చాడు. ఆ గోల్డ్ విలువ 26.62 లక్షలు.