IND VS SLCXI : శ్రీలంక పర్యటనను ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0) డకౌట్తో మొదలెట్టాడు. వామప్ మ్యాచ్లో సున్నాకే వెనుదిరిగాడీ హిట్టర్. శుక్రవారం భారత ఇన్నింగ్స్ మొదలైన రెండో బంతికే యశస్వీని దులిమ్ సుదీర ఔట్ చేశాడు. దాంతో.. ఖాతా తెరవకముందే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇంకా తొలి ఇన్నింగ్స్లో భారత్ 340 పరుగులు వెనకబడి ఉంది.
వామప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్() ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దులిమ్ సుదీర ఓవర్లో అతడు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(8), దేవ్దత్ పడిక్కల్(15)లు భాగస్వామ్యం నిర్మించే పనిలో ఉన్నారు. ఏడు ఓవర్లకు టీమిండియా స్కోర్.. 23జ.7. ఇంకా తొలి ఇన్నింగ్స్లో 340 పరుగులు వెనకబడి ఉంది.
A two-ball 🦆 for Yashasvi Jaiswal on the second morning of the warm-up match in Colombo #INDvSL #SLvIND pic.twitter.com/YKElT6GAHK
— Cricbuzz (@cricbuzz) August 8, 2026
కొలంబోలో జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్లో ఆతిథ్య లంక తొలి ఇన్నింగ్స్ను 363/8 వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు నిషాన్ మదుష్క(66), రవిందు రసన్తా(71), సోనల్ దినుష(52)లు అర్ధ శతకాలతో చెలరేగడంతో శ్రీలంక సవాల్ విసిరే స్కోర్ చేయగలిగింది.