భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో రైతులు నిరసనలకు దిగుతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రైతులు నిరసన తెలుపగా, తాజాగా మధ్యప్రదేశ్ రైతులు అదే బాట పట్టారు. అంతేగాక పంపిణీ కేంద్రంలోని ఎరువుల బస్తాలను లూటీ చేశారు. ఎంపీలోని రత్లాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అలోట్ నియోజకవర్గం పరిధిలోని రైతులు యూరియా కోసం పంపిణీ కేంద్రం వద్ద గురువారం పలు గంటలు నిరీక్షించారు. ఆన్లైన్లో సమస్య వల్ల పంపిణీ చేయలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, అక్కడకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మనోజ్ చౌలా, ఇతర కాంగ్రెస్ నేతలు ఎరువుల గోడౌన్ షట్టర్ తెరిచారు. ఎరువుల బస్తాలు తీసుకెళ్లాలని రైతులకు చెప్పారు. దీంతో రైతులు అందినకాడికి యూరియా బస్తాలను లూటీ చేశారు.
మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రైతులను ఎరువుల బస్తాల లూటీకి ఉసిగొల్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ చౌలా, ఆ పార్టీ నేత యోగేంద్ర సింగ్ జాడోన్తోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
@INCIndia MLA Manoj Chawla along with #Ratlam district #Congress president Yogendra Singh Jadaon have been charged with robbery in Ratlam for allegedly looting urea bags from a government warehouse pic.twitter.com/Etvw8651qV
— Mumbai Tez News (@mumbaitez) November 12, 2022