Priyanka Gandhi | కర్ణాటకలో రాజకీయాలు (Karnataka Politics) హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రత్యర్ధులపై మాటల తూటాలు ప్రయోగిస్తుండటంతో ప్రచార పర్వం ఊపందుకుంది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలకు ఎక్కుపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రనేతలు రంగంలోకి దిగి రాష్ట్రంలో జోరుగా ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటికే పలు ప్రచార ర్యాలీల్లో పాల్గొని కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు.
తాజాగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (Congress General Secretary) ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియాంక.. మంగళవారం కర్ణాటక రాష్ట్రం మైసూర్ (Mysuru) లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అక్కడ ఓ హోటల్ వద్దకు వెళ్లిన ఆమె స్వయంగా దోశలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ (Congress) పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కర్ణాటకలో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్కు 75, జేడీఎస్కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Perfect dosas are just the beginning; with such skillful hands, there's no limit to the power they can bring to the world. pic.twitter.com/qsgUw6IBeJ
— Congress (@INCIndia) April 26, 2023
Also Read..
Passengers Fighting In Flight | విమానం గాల్లో ఉండగా కొట్టుకున్న ప్రయాణికులు.. నలుగురు అరెస్ట్
Operation Kaveri | ముమ్మరంగా సాగుతున్న ఆపరేషన్ కావేరి.. సుడాన్ నుంచి సౌదీ చేరుకున్న మరో 135 మంది