Operation Kaveri | సుడాన్ (Sudan) లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ (Operation Kaveri)తో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తోంది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశీవ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ (V Muraleedharan) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుడాన్ నుంచి మూడో బ్యాచ్లో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియా (Saudi Arabia) లోని జెడ్డా (Jeddah) కు చేరుకున్నట్లు తెలిపారు.
అంతకుముందు మొదటి బ్యాచ్లో భాగంగా భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేదా’ (INS Sumedha) ద్వారా 278 మంది ప్రయాణికులు సుడాన్ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారు. రెండో బ్యాచ్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ (IAF C-130J) విమానంలో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిపింది.
సుడాన్పై పట్టుకోసం ఆ దేశ సైన్యం, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 వేల మందికిపైగా గాయపడ్డారు. కాగా, సుడాన్లో సుమారు మూడు వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు గుర్తించారు.
Third batch comprising 135 Indians from Port Sudan arrived in Jeddah by IAF C-130J aircraft.
Onward journey to India for all who arrived in Jeddah will commence shortly. #OperationKaveri pic.twitter.com/OHhC5G2Pg8
— V. Muraleedharan (@MOS_MEA) April 26, 2023
Also Read..
India Corona | మళ్లీ పెరిగిన రోజూవారీ కరోనా కేసులు.. 24 గంటల్లో 29 మంది మృతి
Delhi Public School | ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు