Delhi Public School | ఢిల్లీ (Delhi)లోని ఓ ప్రముఖ పాఠశాలకు బాంబు బెదిరింపులు (bomb threat) వచ్చాయి. నగరంలోని మధుర రోడ్ (Mathura Road)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్ వచ్చింది. అందులో పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు (Police), బాంబు స్వ్కాడ్ ( bomb squad) పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు వారికి లభించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ-మెయిల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు.
కాగా, ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు పలు పాఠశాలలకు ఫోన్కాల్స్, ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. రెండు వారాల క్రితం కూడా ఇదే తరహాలో దిల్లీ పాఠశాలకు ఈ-మెయిల్ వచ్చింది. సాదిఖ్ నగర్ (Sadiq Nagar)లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ (Indian Public School) ప్రాంగణంలో బాంబులు ఉన్నాయని అందులో పేర్కొనడంతో ఆందోళనకు గురైన యాజమాన్యం.. విద్యార్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించింది. అనంతరం పోలీసులు పాఠశాల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
Also Read..
India Corona | మళ్లీ పెరిగిన రోజూవారీ కరోనా కేసులు.. 24 గంటల్లో 29 మంది మృతి
Ustad Bhagath Singh Movie | ఉస్తాద్ భగత్సింగ్ సినిమా క్రేజీ అప్డేట్.. పవన్ అభిమానులకు పండగే..!
Dasara Movie | మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి దసరా.. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏదంటే?