వనస్థలిపురం, ఆగస్టు 1 : విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసే కుట్రలను నిరసిస్తూ శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురంలో సాగర్ హైవేపై ధర్నా నిర్వహించారు.
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.8వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రే వంత్రెడ్డి ఒంటె త్తు పోకడలతో రాష్ర్టాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు.