Puri Jagannath Temple | దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయం (Puri Jagannath Temple) ఒకటి. ఆ ఆలయంలో జరిగే రథోత్సవం ఎంత ప్రసిద్ధో మనకు తెలసు. ఏటా నిర్వహించే ఈ ఆలయ రథోత్సవంలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహాలోనే జగన్నాథ ఆలయాలను నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పూరీ తరహాలోనే జగన్నాథుడి టెంపుల్ ఉంది. అయితే, వాటన్నింటికీ మించిన భారీ ఆలయం ఒకటి త్వరలో సిద్ధం కాబోతోంది. కాకపోతే అది మన దేశంలో కాదు.. విదేశాల్లో.
బ్రిటన్ (Britain)లో తొలి జగన్నాథ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. రూ. వందల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. లండన్ (London) శివారులో నిర్మించే ఈ ఆలయం కోసం అక్కడి స్థానికులంతా కలిసి శ్రీ జగన్నాథ సొసైటీ యూకే (ఎస్జేఎస్యూకే) (Shree Jagannatha Society UK) పేరిట ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి ఈ సొసైటీ విరాళాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన (Odisha-origin) బిశ్వనాథ్ పట్నాయక్ (Biswanath Patnaik) అనే ప్రవాస భారతీయుడు ఆలయ నిర్మాణానికి ఏకంగా రూ.250 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. విదేశాల్లో ఆలయ నిర్మాణానికి ఇంత పెద్దమొత్తంలో విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి.
శ్రీ జగన్నాథ సొసైటీ యూకే పేరుతో ఏర్పాటైన ఈ కమిటీ అక్షయ తృతీయ రోజున ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ వేడుకకు బిశ్వనాథ్ను కూడా ఆహ్వానించారు. భూరి విరాళం సమర్పించిన బిశ్వనాథ్ పట్నాయక్ వృత్తి రీత్యా యూకేలో స్థిరపడ్డారు. లండన్లో ఫిన్నెస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు.
కాగా, లండన్ శివారులో దాదాపు 15 ఏకరాల్లో ఈ టెంపుల్ నిర్మించనున్నారు. 2024 చివరి నాటికి ఆలయం తొలి విడత నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు ఎస్జేఎస్యూకే ప్రణాళిక రచిస్తోంది. ఈ ఆలయం యూరప్లో జగన్నాథ సంస్కృతికి కేంద్రంగా మారుతుందని శ్రీ జగన్నాథ సొసైటీ యూకే చైర్మన్ డాక్టర్ సహదేవ్ స్వైన్ అన్నారు. వేలాది మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (UK PM Rishi Sunak) తన ఎన్నికల ప్రచార సమయంలోనూ జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
Trustees of SJSUK @Sahadevswain @drprakashdey2 @ItsMeBhakta @sukant74 & Jagannatha bhakts thrilled; With support of @cnribnp @arunkar06 #ShreeJagannathaMandirLondon will soon become a reality! 🙏@narendramodi @PMOIndia @CMO_Odisha @Naveen_Odisha @dpradhanbjp @achyuta_samanta pic.twitter.com/YsXT7Ee7aS
— Shree Jagannatha Society UK (@JagannathaUK) April 25, 2023
Also Read..
India Corona | మళ్లీ పెరిగిన రోజూవారీ కరోనా కేసులు.. 24 గంటల్లో 29 మంది మృతి
Delhi Public School | ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు
Prakash Singh Badal: సోదరభావాన్ని ప్రోత్సహించిన ప్రకాశ్ సింగ్ బాదల్..