Kerala | తిరువనంతపురం: కేరళలోని దేవాలయాల్లో గన్నేరు పూలను వాడటం మానేయాలని రెండు ప్రధాన దేవస్థానం బోర్డులు నిర్ణయించాయి. ఈ పువ్వులు విషపూరితమైనవనే ఆందోళన పెరగడంతో ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ), మలబార్ దేవస్థానం బోర్డు (ఎండీబీ) ఈ నిర్ణయం తీసుకున్నాయి.
రాష్ట్రంలోని అత్యధిక దేవాలయాలు ఈ రెండింటి పరిధిలోనే ఉన్నాయి. గన్నేరు పూలలోని విష స్వభావం వల్ల మానవులకు, జంతువులకు కూడా హాని జరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.