Char Dham Yatra | డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాల్లో భక్తుల పూజలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. శీతాకాలంలో మూసివేసిన దేవాలయాలను భక్తుల కోసం నేటి నుంచి తెరుస్తున్నారు.
కేదార్నాథ్, యమునోత్రి దేవాలయాలను శుక్రవారం ఉదయం 7 గంటలకు తెరుస్తారు. గంగోత్రి దేవాలయాన్ని మధ్యా హ్నం 12.20 గంటలకు, బదరీనాథ్ను ఈ నెల 12న తెరుస్తారు.