PM Modi | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రముఖ క్షేత్రం లేపాక్షి వెళ్లారు. అక్కడ వీరభద్ర స్వామి ఆలయాన్ని (Veerbhadra Temple) సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతలను అర్చకులు ప్రధానికి వివరించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ‘శ్రీరామ జయ రామ’ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. భజన కీర్తలను ఆలపిస్తూ.. భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
పుట్టపర్తి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సుమారు రూ. 541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. పీఎం పర్యట సందర్భంగా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
#WATCH | Prime Minister Narendra Modi sings ‘Shri Ram Jai Ram’ bhajan at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/6F0lyyQSXN
— ANI (@ANI) January 16, 2024
#WATCH | Prime Minister Narendra Modi offered prayers at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/XpY6LPsJcr
— ANI (@ANI) January 16, 2024
#WATCH | Prime Minister Narendra Modi visited and offered prayers at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh. pic.twitter.com/ipvU6Mnibx
— ANI (@ANI) January 16, 2024
Also Read..
Delhi | ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. విమాన సర్వీసులకు అంతరాయం
Donald Trump | రిపబ్లికన్ పార్టీ రేసులో ట్రంప్ షో.. ఫస్ట్ విక్టరీ కొట్టిన మాజీ ప్రెసిడెంట్