న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం దేశంలో పరిస్థితుల చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. వినియోగదారులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ల విషయంలో మరింత అనిశ్చితి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. తగిన సమయంలో ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీపై స్పందిస్తుందని రాజీవ్ స్పష్టం చేశారు.
కరోనా వల్ల గతంలో కంటే ప్రస్తుత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిన మాట వాస్తవమేనని ఆయన అనడం గమనార్హం. అయితే 2022, మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. గత 24 గంటల్లో కేసుల సంఖ్య ఏకంగా 2.61 లక్షలను దాటింది.
నిజానికి కొవిడ్ను పూర్తిగా లేకుండా చేసే స్థితికి ఇండియా వచ్చిందని, అయితే యూకే, ఇతర దేశాల వేరియంట్లు దేశంలోకి ప్రవేశించడంతో పరిస్థితి మారిపోయిందని రాజీవ్ కుమార్ అన్నారు. సెకండ్ వేవ్ సేవల రంగంలాంటి వాటిపై ప్రత్యక్ష ప్రభావం చూపడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలపై పెద్ద ఎత్తున పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. ఈ రెండు ప్రభావాలను ఆర్థిక శాఖ అంచనా వేసిన తర్వాత మరో ఉద్దీపన ప్యాకేజీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.
ఇవి కూడా చదవండి
గాలి ద్వారానే కరోనా.. ఎన్95 లేదా కేఎన్95 మాస్కులే వాడండి
IPL 2021: సన్రైజర్స్కు మరో షాక్.. స్టార్ బౌలర్కు గాయం
భారత వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చిన కెనడా నేత
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ
కరోనా నుండి కోలుకున్న బాలీవుడ్ ప్రేమ జంట
కుంభమేళాకు వెళ్లినవారికి క్వారంటైన్ తప్పనిసరి