Sudarshan Setu | దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్ (Indias Longest Cable Stayed Bridge)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ఉదయం ప్రారంభించారు. గుజరాత్లోని ద్వారకలో ఈ వంతెనను నిర్మించారు. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి ‘సుదర్శన్ సేతు’ (Sudarshan Setu) అని పేరు పెట్టారు. ఇది ఓఖా (Okha) ప్రాంతాన్ని బెట్ ద్వారక (Beyt Dwarka)తో అనుసంధానిస్తుంది.
ఈ వంతెన నిర్మాణానికి 2017 అక్టోబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పుతో, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్కు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్పాత్లు కూడా ఉన్నాయి. సుదర్శన్ సేతును ఒక ప్రత్యేకమైన డిజైన్తో నిర్మించారు. బ్రిడ్జ్ ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు.
కాగా, ప్రధాని మోదీ నేడు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఆయన రాజ్కోట్లోని (గుజరాత్) తొలి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రారంభిస్తారు. ఆ తరువాత ఏపీ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమబెంగాల్లో ఎయిమ్స్ ఆసుపత్రులను కూడా వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మొత్తం రూ.6300 కోట్లతో నిర్మించారు.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates Sudarshan Setu, country’s longest cable-stayed bridge of around 2.32 km, connecting Okha mainland and Beyt Dwarka. pic.twitter.com/4OpY0ekCDH
— ANI (@ANI) February 25, 2024
The Sudarshan Setu, which would be inaugurated by PM @narendramodi in a short while! pic.twitter.com/zF5RbvaYoN
— PMO India (@PMOIndia) February 25, 2024
Stunning Sudarshan Setu! pic.twitter.com/VpNlb95WMe
— Narendra Modi (@narendramodi) February 25, 2024
Also Read..
Cyber Crime | దోచుకునే లాటరీ.. ఆ షార్ట్ లింక్స్ను క్లిక్ చేశారో ఇక అంతే సంగతి!
Kamal Shah | కమాల్షా.. 26 ఏండ్లుగా డయాలసిస్ పైనే..!
Queen of Millet | చిరుధాన్యాల మహారాణి.. 72 దేశవాళి ధాన్యం రకాలను సంరక్షిస్తున్న రాయిమతి