న్యూఢిల్లీ: మణిపూర్ హింస (Manipur Violence) పై పార్లమెంటులో రభస కొనసాగుతున్నది. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని, దానిపై ప్రధాని మోదీ పార్లమెంటుకు సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి ఉభయసభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగకుండా వాయిదాల పర్వం కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ రణ్దీప్ సుర్జేవాలా ప్రధాని నరేంద్రమోదీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానికి అమెరికాకు వెళ్లి అక్కడి పార్లమెంటులో మాట్లాడేందుకు సమయం ఉందిగానీ, మన దేశ పార్లమెంటులో మణిపూర్ అంశంపై మాట్లాడేందుకు సమయం లేదా..? అని సుర్జేవాలా ప్రశ్నించారు.
మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంటుకు సమాధానం ఇవ్వాలంటూ వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా ఆయన పట్టించుకోకపోవడం విచిత్రంగా ఉందన్నారు. ప్రధాని తన తీరుతో భారత దేశాన్ని, దేశానికి స్వాతంత్య్ర సాధించిపెట్టిన సమరయోధులను అవమానించారని వ్యాఖ్యానించారు.
#WATCH | Congress MP Randeep Surjewala says, “PM is insulting the country, freedom fighters… He has time to speak in the US Parliament but does not have time to speak on Manipur in the Parliament of the country. Why does he hate the Indian Constitution and Parliament?” pic.twitter.com/EoAd2WR8rU
— ANI (@ANI) July 25, 2023