హైదరాబాద్: పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ (Ramadan) పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని జామా మసీద్ (Jama Masjid), ముంబైలోని మహిం దర్గా (Mumbai’s Mahim Dargah), హైదరాబాద్లోని మక్కా మసీద్, అసెంబ్లీ ఆవరణలో ఉన్న మసీదుతోపాటు నగరంలోని ఉన్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుని ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పురస్కరించుకుని నగరంలోని మసీదులు కొత్త కలను సంతరించుకున్నాయి. కాగా, రంజాన్ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
#WATCH | Delhi: People gather at Jama Masjid to offer namaz on the occasion of #EidAlFitr pic.twitter.com/8gQO9jRbxs
— ANI (@ANI) April 22, 2023
రంజాన్ నెల రోజా రోజులు నిగ్రహాన్ని నేర్పుతాయి. పరోపకారాన్ని బోధిస్తాయి. సానుభూతి తెలియజేస్తాయి. దేవుడు చూస్తున్నాడన్న తలంపును తట్టి లేపుతాయి. కాబట్టే పద్నాలుగు గంటలపాటు అన్నపానీయాలకు దూరంగా ఉంటారు. మహ్మద్ ప్రవక్త ద్వారా అల్లాహ్ తరపున ఖురాన్ గ్రంథం లిఖించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు నెల రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారు. జీవన గ్రంథమైన ఖురాన్కు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు దేవుడు నెల రోజులపాటు ఉపవాసాలు నిర్ణయించాన్నది ముస్లింల నమ్మకం. కోపం, మదం, మోహం, అవినీతి, అహంకారం, దౌర్జన్యం లాంటి దుర్గుణాలను త్యజించాలని బోధించేదే రంజాన్ మాసం.
#WATCH | People offer namaz at Delhi's Jama Masjid on the occasion of #EidAlFitr pic.twitter.com/rvG7Ntbm83
— ANI (@ANI) April 22, 2023
ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో ‘ఈద్-ఉల్-ఫితర్’ (Eid Ul Fitr) పర్వదిన వేడుకలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అల్లా దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.
గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ నేల ఆలవాలమని, లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధితోపాటు పలు రంగాల్లో ఆసరానందిస్తూ ముస్లింలకు భరోసాగా నిలిచిందని వివరించారు. వారి జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం అమలు చేస్తున్న పలు పథకాలు ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. స్వయం పాలనలో గడచిన తొమ్మిదేండ్లలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.13 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నదని వివరించారు. మైనారిటీల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రగతి కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతర కృషి కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ముస్లిం మైనారిటీ అభివృద్ధి మాడల్ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కృషి కొనసాగుతూనే ఉంటుందన్నారు.
People hug each other after offering namaz at Delhi's Jama Masjid on the occasion of #EidAlFitr pic.twitter.com/nhr8gogkW4
— ANI (@ANI) April 22, 2023
#Maharashtra | People offer namaz at Mumbai's Mahim Dargah on the occasion of #EidUlFitr pic.twitter.com/pHalpwKPrq
— ANI (@ANI) April 22, 2023