న్యూఢిల్లీ, మే 8: లోక్సభ ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న 8 రాష్ర్టాల్లోని 49 నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో బీహార్, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, లఢక్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
మహారాష్ట్ర నుంచి అధికంగా 13 నియోజకవర్గాల్లో 301 మంది, యూపీలో 14 నియోజకవర్గాల్లో 466 మంది పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఛాత్ర నియోజకవర్గంలో అత్యధికంగా 69 మంది, లక్నోలో 67 మంది పోటీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.