న్యూఢిల్లీ: ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్లో ఇథనాల్ కలిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నట్లు వచ్చిన వార్తలను పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు వార్తలు అని, బాధ్యతారాహితంతో కూడిన వార్తలను నమ్మవద్దు అన్నారు. విమాన ఇంధనంలో ఇథనాల్ కలిపే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి రామ్మోమన్ నాయుడు తెలిపారు. ఇథనాల్, సస్టేనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేవి రెండూ భిన్నమైనవని, వాటిని కలపరాదు అని మంత్రి తెలిపారు. సస్టేనియబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇంధమని , ఏసీఏఓ గుర్తింపు దానికి ఉందనన్నారు. చాలా టెస్టింగ్ తర్వాత అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తయారు చేస్తారన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని మానుకోవాలన్నారు. విమాన ప్రయాణికుల్లో గుబులు నింపడం తప్ప ఏమీ లేదన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
The claim that the Government plans to blend ethanol with Aviation Turbine Fuel (ATF) is completely false and irresponsible. There is no such proposal.
Ethanol and Sustainable Aviation Fuel (SAF) are entirely different and should not be conflated. SAF is an internationally…
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) August 6, 2026