JN.1 Case | దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి జేఎన్.1 కేసులు లేవని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తాజాగా వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 తొలి కేసు వెలుగు చూసిన విషయం తెలిసిందే. మొత్తం ముగ్గురి శాంపుల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించగా అందులో ఒకరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 సోకినట్లు బయటపడింది.
అయితే, వైరస్ సోకిన వ్యక్తి గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య మంత్రి తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం అతడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు ఢిల్లీలో జేఎన్.1 వేరియంట్ రోగులు లేరని స్పష్టం చేశారు.
దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 చాపకింద నీరులా పాకుతున్నది. మంగళవారం ఒక్కరోజే 40 JN.1 వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి వరకు మొత్తం JN.1 కేసుల సంఖ్య 109కి చేరింది. అందులో అత్యధికంగా గుజరాత్లో 36 కేసులు, కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు రికార్డయ్యాయి.
Also Read..
Bomb Threat | ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
Canada | నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేయనున్న కెనడా పోలీసులు