Parliament special session | కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ నూతన భవనం (Parliament New Building) నిర్మించిన విషయం తెలిసిందే. ఆ భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని మోదీ (Pm Modi) ఘనంగా ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు కొత్త భవనంలో ఎలాంటి సమావేశాలూ జరగలేదు. తాజా సమాచారం ప్రకారం.. త్వరలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నూతన భవనంలో నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదురోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల (Parliament special session)కు కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 18వ తేదీన పాత భవనంలో సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలు కొత్త భవనంలో కొనసాగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రత్యేక సమావేశాల అజెండాను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ సమావేశాల అజెండా ఏంటో తెలియజేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) లేఖ కూడా రాశారు. 9 కీలక అంశాలపై చర్చకు సమయం కేటాయించాలని ప్రధానిని కోరారు.
మరోవైపు జమిలి ఎన్నికల కోసం ప్రత్యేక బిల్లు, ఇండియా పేరు మార్పు వంటి కీలక బిల్లులను కేంద్రం ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read..