Sanatana Dharma | సనాతన ధర్మం (Sanatana Dharma)పై డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలోని ఓ నగరం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 3వ తేదీని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించింది.
అమెరికా (America)లోని కెంటుకీ (Kentucky) రాష్ట్రంలోని లూయిస్విల్లే (Louisville) మేయర్ సెప్టెంబర్ 3వ తేదీని సనాతన ధర్మ దినోత్సవం (Sanatana Dharma Day)గా ప్రకటించారు. లూయిస్విల్లేలోని హిందూ దేవాలయం కెంటకీలో జరిగిన మహాకుంభాభిషేకం వేడుకలో మేయర్ క్రెయిగ్ గ్రీన్బెర్గ్ తరఫున డిప్యూటీ మేయర్ బార్బరా సెక్ట్సన్ స్మిత్ అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్ అధ్యక్షుడు రిషికేశ్, శ్రీశ్రీ రవిశంకర్, భగవతీ సరస్వతి, లెఫ్టినెంట్ గవర్నర్ జాక్వెలిన్ కోల్మన్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కైషా డోర్సీ, పలువురు ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖులు పాల్గొన్నారు.
కాగా, ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. స్టాలిన్ వ్యాఖ్యలపై మతపెద్దలు, అర్చకులు, బీజేపీ సహా కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే, ఆ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మద్దతు ఇచ్చారు. దీంతో ఉదయనిధి, ప్రియాంక్ ఖర్గేపై యూపీలోని రాంపూర్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు వారిపై కేసు బుక్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 295-ఏ(మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం), 153-ఏ(రెండు గ్రూపులను రెచ్చగొట్టడం) కింద ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Also Read..
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్.. ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు
Sanatana Dharma | ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు పా. రంజిత్ మద్దతు