Parliament session | 17వ లోక్సభ చివరి సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ను ( interim budget) ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా, మేలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు. 17వ లోక్సభ గడువు జూన్ 16న ముగియనున్నది. సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్ సమావేశం కావడం ఇదే చివరిసారి.
#InterimBudgetSession2024, last session of Seventeenth Lok Sabha to be held from 31st January to 9th February, with address of Hon’ble President to the Parliament. On 1st February, Hon’ble FM @nsitharaman ji will present the Interim Union Budget. pic.twitter.com/fF0yzblsgU
— Pralhad Joshi (@JoshiPralhad) January 12, 2024
Also Read..
Houthis | నౌకలపై దాడులు ఆపబోము.. యూఎస్, యూకే దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు : హౌతీ రెబల్స్
Sam Altman | బాయ్ఫ్రెండ్ని పెళ్లాడిన ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్.. ఫొటోలు వైరల్