Dance : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఏడు దశల లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే తొలి దశ, రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మే 7న పోలింగ్ జరగాల్సిన మూడో దశ ఎన్నిలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది.
ఇప్పుడు మిగిలిన ఐదు దశల్లో పోటీ పడబోతున్న అభ్యర్థులు ప్రస్తుతం ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సంబిట్ పాట్రా పూరి లోక్సభ స్థానంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సుచరితా మొహంతిని బరిలో దింపింది. పూరి లోక్సభ స్థానానికి ఆరో దశ ఎన్నికల్లో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది.
కానీ బీజేపీ అభ్యర్థి సంబిట్ పాట్రా ఇప్పటికే ప్రచారంలో జోరు పెంచారు. ఇవాళ పూరి నగరంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వృద్ధురాలితో కలిసి నృత్యం చేశారు. ఈ డ్యాన్స్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
#WATCH | Odisha: BJP’s candidate from Puri Lok Sabha seat, Sambit Patra dances with an elderly woman during his election campaigning in Puri
Congress has fielded Sucharita Mohanty from this seat. Puri will vote on 25th May.#LokSabhaElections2024 pic.twitter.com/e7kpasmprl
— ANI (@ANI) April 29, 2024