Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగింపు దశకు చేరుకుంది. మరో ఐదు రోజుల్లో మహాకుంభమేళా ముగియనుంది. ఈ క్రమంలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. గత ఐదు రోజులుగా రోజూ కోటి మందికిపైగా భక్తులు సంగమంలో నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో 41 రోజుల వ్యవధిలో (ఇవాళ ఉదయం వరకూ) త్రివేణీ సంగమంలో దాదాపు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Uttar Pradesh: Devotees continue to arrive at #MahaKumbh2025 teerth kshetra in large numbers to take a holy dip. pic.twitter.com/AcO63yIY8l
— ANI (@ANI) February 22, 2025
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి (Maha Shivratri) వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. మరో ఐదు రోజుల పాటు భక్తుల రద్దీ ఇదేవిధంగా కొనసాగుతే.. మహా కుంభమేళాలాలో పవిత్ర స్నానాలు చేసే భక్తుల సంఖ్య 65 కోట్లు దాటుతుందని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహా కుంభమేళాలో చివరి రోజైన ఫిబ్రవరి 26న రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.
Also Read..
PM Modi | మారిషన్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా ప్రధాని మోదీ
Kamal Haasan | భాషతో ఆటలొద్దు.. హిందీ వివాదంపై కమల్ హాసన్ హెచ్చరిక