Kamal Haasan | హిందీ భాష విషయంలో కేంద్రం, తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై స్టార్ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Haasan) తాజాగా స్పందించారు. ఇది చాలా సున్నితమైన విషయమని.. తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు.
మక్కల్ నీది మయ్యమ్ పార్టీ స్థాపించి 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలోని పార్టీ ఆఫీస్లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘తమిళులు భాష కోసం ప్రాణాలు అర్పించారు. అందుకే ఇలాంటి వాటితో ఆటలొద్దు. తమకు ఏ భాష అవసరమో తమిళులకు తెలుసు. ముఖ్యంగా పిల్లలు.. ఏ భాష కావాలో ఎంచుకునే జ్ఞానం వారికి ఉంది’ అని కమల్ హాసన్ అన్నారు.
Also Read..
Dharmendra Pradhan | ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పష్టీకరణ
Rajasthan Assembly: దాదీ వ్యాఖ్యలపై దుమారం.. అసెంబ్లీలోనే నిద్రపోయిన ఎమ్మెల్యేలు
Maha Kumbh: యూపీ జైళ్లకు త్రివేణి సంగమ పవిత్ర జలాలు.. 90 వేల ఖైదీల పుణ్య స్నానాలు