Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore)లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Horrific Train Accident) లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యావత్తు ప్రపంచాన్ని కదిలించిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 288 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సుమారు 1000 మందికిపైనే గాయాలపాలయ్యారు.
అయితే, మృతుల్లో కనీసం 40 మంది విద్యుత్ షాక్ వల్లే (electrocuted) ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.. పట్టాలు తప్పిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అందులో కనీసం 40 మృతదేహాల శరీరాలపై ఎలాంటి గాయాలైన ఆనవాళ్లూ కనిపించలేదని సదరు పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో ఓవర్హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడి విద్యుత్ షాక్ జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాద ఘటన.. ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది
Venkatesh Iyer | దోతీ కట్టి.. వేదపాఠశాల విద్యార్థులతో క్రికెట్ ఆడిన అయ్యర్.. వీడియో వైరల్
Nova Kakhovka dam | ఉక్రెయిన్లోని కీలకమైన డ్యామ్ పేల్చివేత.. ప్రమాదంలో ఖేర్సాన్ ప్రాంతం