న్యూఢిల్లీ: ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మార్పులు, నిబంధనలు ఏమిటంటే.. రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త రూల్: ఇండియన్ రైల్వేస్ టోకెన్ల పంపిణీ తీసుకొచ్చింది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడటమే కాక, ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది.
క్రెడిట్ కార్డ్ రివార్డులు: బ్యాంకులు సర్వీస్ చార్జీలు, క్రెడిట్ కార్డ్ ఫ్రేమ్వర్క్స్, అలర్ట్ ఫీజులను వ్యవస్థీకృతం చేశాయి. దీంతో చార్జీలు పెరిగే అవకాశం ఉన్నది.
సీకేవైసీతో కస్టమర్ వెరిఫికేషన్: బ్యాంక్ ఖాతా తెరిచిన ప్రతిసారీ, లేదా మ్యూచ్వల్ ఫండ్ కొనుగోలు చేసిన ప్రతిసారీ కైవేసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
తపాలా శాఖలో మార్పులు: పత్రాలు, పార్శిళ్ల వర్గీకరణలో మార్పులు చేశారు. రిటైల్, హోల్సేల్ వినియోగదారులకు స్పీడ్ పోస్ట్ సేవల్లో ప్రత్యేక ధరలను ప్రకటించారు.