Odisha Train Accident | ఒడిశా (Odisha )లోని బాలాసోర్ (Balasore )లో ఘోర రైలు ప్రమాదం (Horrific Train Accident) జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే, ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచిపోయింది. ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 200 మందికిపైగా చికిత్స పొందుతున్నట్లు తూర్పు మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ రింకేశ్ రాయ్ తెలిపారు.
‘ఈ ఘోర రైలు ప్రమాదంలో 1,100 మంది గాయపడ్డారు. వారిలో 900 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో సుమారు 200 మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మరణించిన 288 మందిలో 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది’ అని ఆయన తెలిపారు.
మరోవైపు బాలాసోర్ జిల్లాలో ఉన్న బహనగా బజార్ స్టేషన్లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనపై సీబీఐ(CBI) విచారణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సీబీఐ అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు.
Also Read..
Golden Temple | ఆపరేషన్ బ్లూ స్టార్.. గోల్డెన్ టెంపుల్ వద్ద భద్రత కట్టుదిట్టం
Prabhas | పంచె కట్టులో ప్రభాస్.. లుక్ అదిరిపోయిందిగా..!