Golden Temple | సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine)గా ప్రసిద్ధిగాంచిన పంజాబ్ అమృత్సర్ (Amritsar) లోని స్వర్ణ దేవాలయం (Golden Temple) వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ (Operation Blue Star) పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 39 ఏళ్లు. ఈ సందర్భంగా అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు లా అండ్ ఆర్డర్ డీసీపీ పర్మీందర్ సింగ్ భండాల్ తెలిపారు. ఆపరేషన్ బ్లూస్టార్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మరోవైపు ఆపరేషన్ బ్లూస్టార్ని పురస్కరించుకుని రాడికల్ సిక్కు సంస్థ దాల్ ఖల్సా జూన్ 6న అమృత్ సర్ బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు మద్దతు కోరుతూ వాలంటీర్లు కరపత్రాలు పంపిణీ చేశారు. ఇదే కాకుండా ఇటీవల స్వర్ణ దేవాలయం పరిసరాల్లో తరచూ పేలుళ్ల ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంజాబ్ అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అర్పిత్ శుక్లా పేర్కొన్నారు. కేంద్ర బలగాలను కూడా మోహరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని, పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 39 ఏళ్లు. గత కొన్నేళ్లుగా దేవాలయంపై దాడి జరిగిన రోజున కొంతమంది నినాదాలు చేయడం, ఘర్షణ జరగడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో సుమారు 4 దశాబ్దాలుగా స్వర్ణ మందిరం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ కాంప్లెక్స్లో దాగి ఉన్న ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1984లో సైనిక చర్యకు ఆదేశించారు. అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ సైనిక చర్యలో సుమారు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Also Read..
Prabhas | పంచె కట్టులో ప్రభాస్.. లుక్ అదిరిపోయిందిగా..!
Heavy Weight Torpedo: స్వదేశీ హెవీ వెయిట్ టార్పిడో పరీక్ష సక్సెస్.. వీడియో
Southwest Monsoon | నాలుగు రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు.. మరో వారం దాకా అధిక ఉష్ణోగ్రతలే!