న్యూఢిల్లీ: చేనేత కార్మికులు, చేతివృత్తిదారులకు మెరుగైన మార్కెట్ సదుపాయాన్ని అందించడానికి గవర్న్మెంట్ ఈ-మార్కెట్ప్లేస్ (జీఈఎమ్) పోర్టల్ (GeM portal) విశేషంగా సహాయపడనున్నది. ఆన్బోర్డ్ వీవర్స్, చేతివృత్తుల వారికి వారి వారి ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వ విభాగాలకు విక్రయించడానికి వీలుగా ఈ డ్రైవ్ను ప్రారంభించారు. చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు, మహిళలు, గిరిజన పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక బృందాలకు సేవలను పొందాలనుకునే వారితో భాగస్వామ్యాన్ని పెంచుతున్నది.
ప్రభుత్వ డాటా ప్రకారం, గత నెల 30 వరకు 28,374 మంది చేతివృత్తులవారు, 1,49,422 మంది చేనేత కార్మికులు పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జీఈఎమ్లో ఆర్టిజన్స్, వీవర్స్, విక్రేతల రిజిస్ట్రేషన్, ఆన్బోర్డింగ్ను చేనేత డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయం గత ఏడాది జూలైలో ప్రారంభించింది. 56 హస్తకళల సేవా కేంద్రాలు, 28 వీవర్ సేవా కేంద్రాల నుంచి అధికారులు శిక్షణ పొంది విక్రేతల నమోదు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. చేనేత ఉత్పత్తుల కోసం 28 ప్రత్యేకమైన ఉత్పత్తి క్యాటగిరీలు సృష్టించినట్లు ప్రభుత్వం తెలిపింది. హస్తకళల ఉత్పత్తుల కోసం ఏకకాలంలో 170 అనుకూల ఉత్పత్తి వర్గాలు సృష్టించారు.
తికాయత్ ఒక డెకాయిట్: ఎంపీ అక్షైబర్ లాల్ గోండ్
వ్యాక్సిన్ తీసుకోలేదా? అయితే, ప్రభుత్వ సేవలు బంద్
అధికారులు మా చెప్పులు మోస్తారు : ఉమాభారతి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆరోసారి వ్యాక్సిన్ డోసు కోసం వచ్చిన బీజేపీ నేత.. ఎలా దొరికాడంటే?
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
పాకిస్తాన్లో రెపరెపలాడిన తాలిబాన్ జెండాలు.. చిక్కుల్లో ఇమ్రాన్ఖాన్
వివాదాల సుడిగుండంలో పంజాబ్ కొత్త సీఎం
ఢిల్లీలో పాగా వేసిన ఈస్ట్ఇండియా కంపెనీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..