బహ్రైచ్: రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ను డెకాయిట్గా అభివర్ణించారు బీజేపీ ఎంపీ అక్షైబర్ లాల్ గోండ్ (Akshaibar Lal Gond). ఆయన నడుపుతున్న ఉద్యమానికి విదేశీల నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. ఈ ఉద్యమం వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు పూర్తయిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.
‘తికాయత్ ఒక డెకాయిట్. రైతుల ఆందోళన లేదు. నిరసనకారులు రైతులు కాదు. వారు ‘సిఖిస్తాన్’, పాకిస్తాన్ ప్రేరణ పొందిన రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు. కెనడాతో పాటు పలు విదేశాల నుంచి వీరికి డబ్బు అందుతున్నది. ఈ డబ్బు ఉగ్రవాద నిధుల కోసం అని, ప్రభుత్వ విచారణ సంస్థలు పరిశీలిస్తున్నాయి’ అని అక్షైబర్ లాల్ గోండ్ అన్నారు. నిరసనకారుల వాస్తవికత అంతా ప్రజలకు తెలుసునని గోండ్ చెప్పారు. నిజమైన రైతులు నిరసన తెలుపుతుంటే ఆహార పదార్థాల కొరత ఉండేది కదా? అని ప్రశ్నించారు. కూరగాయలు, పాలు, ఆహార ధాన్యాలు, పండ్లు.. మార్కెట్లకు ఎలా చేరుతున్నాయో తికాయత్ చెప్పాలన్నారు.
వ్యాక్సిన్ తీసుకోలేదా? అయితే, ప్రభుత్వ సేవలు బంద్
అధికారులు మా చెప్పులు మోస్తారు : ఉమాభారతి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆరోసారి వ్యాక్సిన్ డోసు కోసం వచ్చిన బీజేపీ నేత.. ఎలా దొరికాడంటే?
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
పాకిస్తాన్లో రెపరెపలాడిన తాలిబాన్ జెండాలు.. చిక్కుల్లో ఇమ్రాన్ఖాన్
వివాదాల సుడిగుండంలో పంజాబ్ కొత్త సీఎం
ఢిల్లీలో పాగా వేసిన ఈస్ట్ఇండియా కంపెనీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..