భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి (Uma Bharati) మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఉమాభారతి.. ఈసారి అధికారులపై నోరు పారేసుకున్నారు. భోపాల్లో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా బ్యూరోక్రాట్లపై ఉమాభారతి చేసిన వ్యాఖ్యలతో సరికొత్త వివాదాన్ని రేపారు. మీడియాతో ఇంటరాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీకి తలనొప్పిగా తయారైంది.
బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకుల చెప్పులు ఎత్తుకుంటారని, రాజకీయ నాయకులను నియంత్రించే శక్తి వారికి లేదని ఉమాభారతి తాజాగా వ్యాఖ్యానించి కొత్త వివాదానికి తెరలేపారు. నాయకులను బ్యూరోక్రసీ నియంత్రిస్తుందని మీడియా ఎందుకు అనుకుంటున్నది? అని తిరిగి ప్రశ్నించారు. వాళ్లకు అంత సీన్ లేదు. మేం చెప్పినట్లుగానే వినాల్సి ఉంటుందన్నారు. బ్యూరోక్రాట్లతో మొదట ఒంటరిగా మాట్లాడుతాం. వాళ్లు ఫైల్ తయారుచేసి అనుమతి కోసం మా వద్దకు తీసుకువస్తారని చెప్పారు. ‘కేంద్ర మంత్రిగా 11 ఏండ్లు ఉన్నాను. ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాను. బ్యూరోక్రాట్లతో చర్చించిన మీదట ఫైల్ ముందుకు కదులుతుంది. నాయకులను బ్యూరోక్రసీ నియంత్రించడం అనేది అర్థం లేనిది. వాళ్లు మమ్మల్ని కంట్రోల్ చేయలేదు. వాళ్లకు అలాంటి పవర్స్ లేవు. వాళ్లు జీతాలు, పోస్టింగ్స్, ప్రమోషన్స్ అండ్ డిమోషన్స్.. ఇలా అన్నీ మేమే చూస్తాం. నిజం చెప్పాలంటే, బ్యూరోక్రసీ నెపంతో మేం రాజకీయాలు చేస్తాం’ అని ఉమాభారతి కుండబద్దలు కొట్టారు.
ఇలాఉండగా, బ్యూరోక్రాట్లపై ఉమాభారతి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేకే మిశ్రా ఖండించారు. ఆమె ప్రకటన సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉమాభారతి నుంచి వివరణ కోరాలని, ఈ విషయంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆరోసారి వ్యాక్సిన్ డోసు కోసం వచ్చిన బీజేపీ నేత.. ఎలా దొరికాడంటే?
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
పాకిస్తాన్లో రెపరెపలాడిన తాలిబాన్ జెండాలు.. చిక్కుల్లో ఇమ్రాన్ఖాన్
వివాదాల సుడిగుండంలో పంజాబ్ కొత్త సీఎం
ఢిల్లీలో పాగా వేసిన ఈస్ట్ఇండియా కంపెనీ
ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి కేకలు.. తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న ప్రజలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..