ఇంటిని శుభ్రం చేసే నీళ్లలో ఓ టేబుల్ స్పూన్ పసుపు కలిపితే.. ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి. ఇతర క్రిమికీటకాలూ నశిస్తాయి. లీటర్ నీటిలో కొద్దిగా వేపనూనె కలిపి తలుపులు, కిటికీల దగ్గర స్ప్రే చేస్తే పురుగులు రావు. ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి మెత్తటి పొడి చేసుకోవాలి. ఆ పొడితో పొగబెడితే దోమలు నశిస్తాయి. ఓ రెండు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని చిన్న మంటపై కాల్చాలి. ఈ ఘాటైన వాసనకు ఈగలు, ఇతరక్రిమికీటకాలు వంట గదిలోంచి పరార్ అవుతాయి.