బూర్గంపహాడ్, ఆగస్టు 5: వృద్ధులు, దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో రాహుల్కు వినతిపత్రం అందజేశారు.
సర్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందని వారు తెలిపారు. మండలపరిధిలోని సారపాక, తాళ్లగొమ్మూరు, కోయగూడెం పంచాయతీల్లో పలువురు ఓటర్లు తమ ప్రాంతంలో అందుబాటులో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో కాకుండా దూరంగా ఉన్న మరో పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సి వస్తుందని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. దివ్యాంగులు, వృద్ధులు, ఓటర్లకు సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లోకి పోలింగ్ బూత్లను మార్చితే దూరాభారం తగ్గి వ్యయప్రయాసలు తప్పుతాయని ఆ వినతిలో పేర్కొన్నారు.
ఎన్నికల రిట్నరింగ్ అధికారికి వినతిపత్రం అందజేసిన వారిలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీనువాసరావు, యువజన నాయకులు చల్లకోటి పూర్ణచందర్రావు, సోము లక్ష్మీ చైతన్యరెడ్డి, నాయకులు తుపాకుల రవికుమార్, తిరుపతి ఏసోబు ఉన్నారు.