Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు పోస్టర్లు, బ్యానర్లు పెట్టకుండా ప్రజలపై నమ్మకం, ప్రేమ పెంచుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవొచ్చని అన్నారు. తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పారు. గతంలో ఓ ఎన్నికల్లో తాను ఓటరుకు కేజీ మటన్ ( kg Mutton) పంపిణీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో ఓడిపోయానంటూ చెప్పుకొచ్చారు.
ఇటీవలే నాగ్ పూర్ లో నిర్వహించిన మహారాష్ట్ర స్టేట్ టీచర్స్ కౌన్సిల్ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొని మాట్లాడారు. ‘ఓటర్లు చాలా తెలివైన వారు. ఎవరికి ఓటు వేయాలో వారికి బాగా తెలుసు. రాజకీయ నాయకులు ప్రజల నమ్మకాన్ని, ప్రేమను సంపాదిస్తే చాలు. డబ్బులు పంచడం, పోస్టర్లు, బ్యానర్లు వేయడం కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. కొందరు అనవసరంగా ఓటర్లకు డబ్బు పంచడం, తాయిలాలు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. నేనూ గతంలో అలానే చేశా. ఒక్కో ఓటరుకు కిలో మటన్ పంపిణీ చేశాను. అయినా కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయాను. ఓటర్లు ఎన్నికల సమయంలో ప్రతి అభ్యర్థి నుంచి డబ్బులు, ఇతర తాయిలాలను స్వీకరిస్తారు. కానీ, చివరికి వారికి సరైన వ్యక్తి అని భావించే అభ్యర్థికే ఓటు వేస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గడ్కరీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Narayana Murthy | అభిమానులను కరీనా అంతగా పట్టించుకోదు.. నటి గురించి నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
BMW Car | ఖరీదైన బీఎండబ్ల్యూ కారు .. అందరూ చూస్తుండగానే మంటల్లో కాలిపోయింది .. వీడియో
Manipur | రెండు రోజుల్లోనే.. మణిపూర్ లోకి ప్రవేశించిన 718 మంది మయన్మార్ జాతీయులు