Narayana Murthy | బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) గురించి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు (Infosys co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులను కరీనా అంతగా పట్టించుకోదని అన్నారు. ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
వీడియోలో నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఓసారి తాను లండన్ నుంచి వస్తుండగా విమానంలో పక్క సీట్లో నటి కరీనా కపూర్ కూర్చున్నట్లు చెప్పారు. అప్పుడు ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి నటిని పలకరించారని.. అయితే ఆమె కనీసం స్పందించలేదన్నారు. అది చూసి తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. ఎవరైనా మనదగ్గరకు వచ్చి పలకరిస్తే లేచి నిల్చుని నిమిషమో, అర నిమిషమో మాట్లాడతాం.. మన నుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే కద అంటూ గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.
అయితే నారాయణమూర్తి వ్యాఖ్యలను పక్కనే ఉన్న ఆయన సతీమణి సుధామూర్తి (Sudha Murthy) వ్యతిరేకించారు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఫౌండర్ అయిన నారాయణమూర్తికి 10 వేల మంది అభిమానులు మాత్రమే ఉంటారేమో.. కానీ ప్రముఖ సినీ నటి అయిన కరీనాకు కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారని అన్నారు. ఇలాంటివి చూసి ఆమె విసిగిపోయి ఉంటుంది అంటూ కరీనాకు మద్దతుగా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read..
BMW Car | ఖరీదైన బీఎండబ్ల్యూ కారు .. అందరూ చూస్తుండగానే మంటల్లో కాలిపోయింది .. వీడియో
Manipur | రెండు రోజుల్లోనే.. మణిపూర్ లోకి ప్రవేశించిన 718 మంది మయన్మార్ జాతీయులు
IRCTC | ఐఆర్సీటీసీ లో సాంకేతిక సమస్య.. నిలిచిన టికెట్ బుకింగ్ సేవలు