Mallikarjun Kharge | పబ్లిక్ మీటింగ్స్, మీడియా సమావేశాల్లో కొందరు నేతలు తడబాట్లకు గురవుతుంటారు. నోరు జారి ఒకరిపేరుకు బదులు మరొకరి పేరు పలకడం.. ఒక దేశానికి బదులుగా మరో దేశం గురించి మాట్లాడటం వంటివి చేస్తుంటారు. అయితే తమ పొరపాటును గ్రహించేలోపే అవి ప్రజల్లోకి వెళ్లిపోయి విమర్శలపాలవుతుంటారు. అలాంటి అనుభవమే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)కి ఎదురైంది.
ఓ పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న ఖర్గే.. రాజీవ్ గాంధీ ( Rajiv Gandhi) పేరును పలకబోయి పొరపాటున రాహుల్ గాంధీ (Rahul Gandhi) అని సంభోదించి విమర్శలపాలవుతున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అనూప్గఢ్ (Anupgarh)లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఖర్గే పాల్గొని మాట్లాడారు. ‘రాహుల్గాంధీ వంటి నాయకులు దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించారు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఖర్గే పొరపాటును గ్రహించిన ఇతర నేతలు వెంటనే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ వెంటనే తన వ్యాఖ్యలను సరి చేసుకున్నారు.
తనను క్షమించాలని, రాజీవ్ గాంధీ పేరుకు బదులు పొరపాటున రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించానంటూ వివరణ ఇచ్చుకున్నారు. ‘రాజీవ్ గాంధీ వంటి నేతలు జాతి సమైక్యత కోసం ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్లో దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకులు ఉన్నారు. కానీ బీజేపీలో మాత్రం ప్రాణాలు తీసే నేతలు ఉన్నారు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అయితే, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు, పలువురు నేతలు ఖర్గేపై మండిపడుతున్నారు. మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన ప్రసంగం వీడియోను షేర్ చేస్తూ.. ‘అలా ఎప్పుడు జరిగింది..?’ అంటూ చురకలంటిస్తున్నారు. కాగా, 200 స్థానాలు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీకి (Rajasthan Assembly Elections) ఈ నెల 25న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడవుతాయి.
Also Read..
Hijack | ఎర్ర సముద్రంలో కార్గో షిప్ను ఎలా హైజాక్ చేశారో చూడండి.. వీడియో
Rasgulla | పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి గాయాలు
US Navy plane | రన్వేపై అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన భారీ విమానం..